Amaravati: ముగింపు దశకు చేరుకున్న ఏపీ కలెక్టర్ల సదస్సు రెండో రోజు!

Amaravati: అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఈ-గవర్నెన్స్, భూ పరిపాలన, శాంతిభద్రతలపై సమీక్షించింది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 11 Sept 2026 3:02 PM IST
Amaravati
X

Amaravati: ముగింపు దశకు చేరుకున్న ఏపీ కలెక్టర్ల సదస్సు రెండో రోజు!

Amaravati: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సు రెండో రోజుకు చేరుకుంది. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో తొలిరోజు గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలు, ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. రెండో రోజు కూడా పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో విస్తృతంగా సమీక్ష నిర్వహించనున్నారు.

రెండో రోజు ప్రధానంగా ఈ-గవర్నెన్స్, ఆర్టీజీఎస్, పీజీఆర్ఎస్‌ పనితీరుపై సమీక్ష జరగనుంది. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతున్నాయా లేదా అనే అంశాన్ని అధికారులు, కలెక్టర్ల నుంచి సీఎం తెలుసుకోనున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం, వాటిపై అధికారులు తీసుకుంటున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరగనుంది.

అదే విధంగా భూ పరిపాలనపై కూడా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై జిల్లా వారీగా సమీక్షించే అవకాశం ఉంది. భూములకు సంబంధించిన సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వాటికి సంబంధించిన నిధుల సద్వినియోగంపైనా రెండో రోజు సమావేశంలో సమీక్ష ఉంటుంది. కేంద్రం నుంచి వస్తున్న నిధులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వినియోగిస్తున్నారా, పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు చేరుతున్నాయా అనే అంశాలను పరిశీలించనున్నారు. జిల్లాల వారీగా పథకాల పురోగతిపై కలెక్టర్ల నుంచి వివరాలు తీసుకోనున్నారు.

ఇక క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై ఓపెన్ ఫోరం ద్వారా చర్చించనున్నారు. జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి అధికారులు చేపట్టిన పరిష్కార చర్యలను కలెక్టర్లు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. సమస్యలను కేవలం నివేదికలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సీఎం సూచనలు చేయనున్నారు.

రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపైనా రెండో రోజు సమీక్ష జరగనుంది. జిల్లాల వారీగా పరిస్థితులు, నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖల పనితీరు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, ప్రజలకు అందుతున్న సేవలపై చర్చ జరగనుంది. చివరగా సదస్సులో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వేగం, ప్రజా సమస్యల పరిష్కారంలో జవాబుదారీతనం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్లకు సీఎం సూచించనున్నారు...

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.