ముంబయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ

Amaravati: ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూడు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 15 July 2026 7:42 PM IST
Amaravati
X

ముంబయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..మూడు వారాల తర్వాత ఫిజియోథెరపీ.. పూర్తిస్థాయి కోలుకోవడానికి నాలుగు నెలల సమయం

Amaravati: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన, వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతి ఇచ్చారు. డిశ్చార్జ్ అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు.

గత కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు వైద్య పరీక్షల అనంతరం రొటేటర్ కఫ్ గాయం తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

వైద్యుల సూచన మేరకు పవన్ కళ్యాణ్ వచ్చే మూడు వారాల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఫిజియోథెరపీ ప్రారంభించాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స జరిగిన భుజం పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి సుమారు నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. ఈ కాలంలో భుజంపై ఒత్తిడి పడే పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ముంబయికి వెళ్లి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సందేశాలు పంపించారు.

హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటూనే అవసరమైన ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలను పరిమిత స్థాయిలో సమీక్షించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు సూచించిన చికిత్స, ఫిజియోథెరపీని క్రమం తప్పకుండా కొనసాగిస్తే త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వారు వెల్లడించారు. దీంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఆయన త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story