Amaravati: నేడే ఏపీ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్: హాజరుకానున్న సీఎం చంద్రబాబు

Amaravati: విజయవాడలో జరగనున్న ఏపీ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026 (AP MSME Growth Summit 2026) కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 May 2026 6:53 AM IST
Amaravati
X

Amaravati: నేడే ఏపీ ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్: హాజరుకానున్న సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ పారిశ్రామిక ప్రగతికి ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్ 2026 కీలక వేదిక.. నేడు విజయవాడలో జరగనున్న సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు హాజరు.. రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న సీఎం.. మూడో విడతలో పారిశ్రామిక విస్తరణకు ప్రభుత్వం మరో ముందడుగు.. ప్రతి నియోజకవర్గంలో ఓ ఎంఎస్ఎంఈ పార్కు లక్ష్యంగా ప్రణాళిక.. తొలి రెండు దశల్లో 100 పార్కులకు ఇప్పటికే శంకుస్థాపనలు పూర్తి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, పారిశ్రామికవేత్తల పాల్గొనడం.. 1,500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగ ప్రతినిధులు హాజరు కానున్న సమ్మిట్.. గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం రూట్యాగ్ స్మార్ట్ విలేజ్ కేంద్రాల ప్రారంభం.. కుప్పం, మంగళగిరి, పిఠాపురంలో కొత్త ఎక్స్‌టెన్షన్ సెంటర్లకు శ్రీకారం.. రూ.200 కోట్లతో 45 పారిశ్రామిక క్లస్టర్లలో ఉమ్మడి సౌకర్యాల కేంద్రాలు.. యువత, మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం.. మెటా, అమెజాన్ వంటి సంస్థలతో కీలక ఒప్పందాలకు అవకాశం.. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఎంఎస్ఎంఈ సమ్మిట్ అడుగులు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story