Amaravati: రాయలసీమ ఇరిగేషన్పై జగన్కు మంత్రి నిమ్మల ఘాటు కౌంటర్!
Amaravati: రాయలసీమ ప్రాజెక్టులను గత ఐదేళ్లలో జగన్ తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి తెలిపారు.
Amaravati: రాయలసీమ ఇరిగేషన్పై జగన్కు మంత్రి నిమ్మల ఘాటు కౌంటర్!
Amaravati: "రప్ప రప్ప" అంటూ, రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్లుగా నరుకుతాము, రక్తాన్ని పారిస్తామని పదే పదే చెప్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి నోటి నుంచి ఈరోజు రాయలసీమ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది.
తన ఐదేళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశాం, ఇరిగేషన్ కు ఏం చేశామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి జగన్ ది. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడేటువంటి జగన్ మోహన్ రెడ్డి, ఈ ఐదేళ్లలో ఆ శ్రీశైలం, పోతిరెడ్డిపాడుకు సంబంధించి ఏమి పనులు చేశామో, ఏమి పూర్తి చేశామో కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి అని దుయ్యబట్టారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
శ్రీశైలం రిజర్వాయర్ కు, గత సంవత్సరం 2,000 టిఎమ్సిల నీరు వస్తే, ఈ సంవత్సరం 'సూపర్ ఎల్ నినో' ప్రభావంతో కేవలం 208 టిఎమ్సిల నీరు మాత్రమే వచ్చింది. అందులో 66% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా.
అందులో పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా, నాగార్జునసాగర్ రైట్ అండ్ లెఫ్ట్ కెనాలు, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ కే దగ్గర, దగ్గర 90 టిఎమ్సిలు, చెన్నైతో కలుపుకుంటే 100 టిఎమ్సిలు కేవలం డ్రింకింగ్ వాటర్ కే మనకు అవసరం అవుతుందని అంచనా. దీన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీశైలం నుంచి అటు రాయలసీమకి ప్రతి రోజు కూడా 11,500 క్యూసెక్కుల నీటిని మనం పంప్ చేస్తున్నాం.
అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, మంత్రిగా నేను గాని, మా ఈఎన్సి దగ్గర నుంచి, ఇరిగేషన్ అధికారులు, కలెక్టర్స్ వరకు కూడా ప్రతి జిల్లాలోనూ ఎప్పటికప్పుడు రైతాంగాన్ని గాని, ప్రజలను గాని ఎడ్యుకేట్ చేస్తూ, సూపర్ ఎల్ నినో ప్రభావంతో, మైనస్ వర్షపాతం నమోదవుతుందో, దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉన్నటువంటి నీటిని త్రాగునీటి అవసరాలకే ప్రథమ ప్రాధాన్యతనిచ్చి,
ఆ త్రాగునీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే ఆరుతడి పంటలకి అవకాశం ఉన్న చోటనే వెళ్లేటువంటి పరిస్థితి ఉండాలి, దీన్ని రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఒక కమిటీలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలని చాలా క్లియర్ గా ఎప్పటికప్పుడు పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేస్తూ, ఒక్క గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి 10,40,000 ఎకరాలు తప్ప మిగిలినటువంటి ప్రాంతానికి అంతటికీ కూడా 2027 జూలై వరకు కూడా ఈ నీటిని భద్రపరుచుకోవాలి.
ఈ త్రాగునీరు అవసరాలకి మించి మనకి ఇన్ఫ్లో వచ్చినప్పుడు మాత్రమే ఆరుతడి పంటలకి వెళ్లాలని చాలా క్లియర్ గా, మే నెల నుంచి కూడా ఎప్పటికప్పుడు మనం రైతులని, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి నీటిని కిందకి పంపించేస్తుంది అని మాట్లాడుతూ ఉంటే, ఆ యొక్క తెలంగాణ ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ ద్వారా వచ్చేటువంటి నీరు నాగార్జునసాగర్ కే వస్తుందనేటువంటి ఆలోచన కూడా ఆయనకు లేకపోవడం చాలా విడ్డూరం.
ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి నీరు ఎక్కడికి వస్తుంది? నాగార్జునసాగర్ కే వస్తూ ఉంది. మరొకపక్క ఆయన నాగార్జునసాగర్ కి కూడా నీళ్లు విడుదల చేయట్లేదు, రైట్ కెనాల్ కి అని చెప్తున్నారు. మరి నాగార్జునసాగర్ రైట్ కెనాల్ కి నీళ్లు విడుదల చేయాలంటే శ్రీశైలం నుంచే కదా రావలసింది?
నాగార్జునసాగర్ రైట్ కెనాల్ కి సంబంధించి 32 టిఎమ్సిలు మనకి డ్రింకింగ్ వాటర్ కి అవసరం. అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించి పులిచింతలలో ఉన్నటువంటి రిజర్వ్ వాటర్ పోను ఇంకా 15 టిఎమ్సిలు అవసరం. అంటే సుమారు 46 టిఎమ్సిలు ఒక్క ఆంధ్రాకే నాగార్జునసాగర్ కి అవసరమైనటువంటి పరిస్థితి. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చినటువంటి నీరు కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి నాగార్జునసాగర్ ద్వారా మనకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మరి అవగాహన లేకుండా జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
ఆ యొక్క విద్యుత్ ఉత్పత్తి ద్వారా తెలంగాణ ఉత్పత్తి చేస్తూ ఉందో, దాన్ని కూడా మన అవసరాలకి మించి ఉత్పత్తి చేయడానికి లేదు అని చెప్పి KRMB కి ఆల్రెడీ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి జలశక్తి మినిస్టర్ కి సంబంధించినటువంటి సెక్రటరీ గారికి కూడా మనం లెటర్స్ కూడా ఇచ్చి, ఆ యొక్క జల ఉత్పత్తికి సంబంధించినటువంటి ఆ నీటిని కూడా ఆంధ్రా అవసరాలకి ఎక్కడా కూడా విఘాతం కలగకుండానే ఉండాలని చాలా క్లియర్ గా మనము లెటర్స్ పెట్టి వాళ్లతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడడం కూడా జరుగుతుందని తెలిపారు మంత్రి నిమ్మల.
రాయలసీమ ప్రాజెక్టులకు ఏం చేశావ్ జగన్?
జగన్ మోహన్ రెడ్డిని సూటిగా ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2019 లో రాయలసీమలో 52 సీట్లు ఉంటే 49 సీట్లకు గెలిపించారు.నాడు అంత ఘన విజయం ఇస్తే, మరి మీ ఐదేళ్లలో ఆ యొక్క రాయలసీమకు ఏం చేశామో గుండెల మీద చెయ్యి వేసుకుని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పగలరా అని ప్రశ్నిస్తూ ఉన్నా.ఇవాళ శ్రీశైలం గురించి మాట్లాడుతూ ఉన్నారు, అదే శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదకరంగా ఉంది, వెనువెంటనే ఆ ప్లెంజ్ పూల్ కి మరమ్మతులు చేయాలి.
లేకపోతే తెలుగు జాతి ఒక ప్రాజెక్టును కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని సాక్షాత్తు CWC సైతం హెచ్చరికలు పెడితే, ఐదు సంవత్సరాలు ఎందుకు శ్రీశైలం వైపు కన్నెత్తి చూడలేదు? ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక 203 కోట్లు వెచ్చించి,మరమ్మతుల పనులు చేస్తూ ఉన్నాం. శ్రీశైలాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం.
తుంగభద్ర భద్రంగా ఉంటేనే ఇవాళ ఎల్ఎల్సి గాని, హెచ్ఎల్సి గాని, కేసీ కెనాల్ కి గాని. తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమ కరువు పీడిత ప్రాంతానికి జీవనాధారం. అటువంటి రాయలసీమ కరువు ప్రాంతానికి ఆధారమైనటువంటి తుంగభద్ర భద్రతకే ముప్పు ఉంది, గేట్లన్నీ కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉందని, ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వానికి విన్నవించుకుంటే, కనీసం ఆ గేట్లు మార్చేటువంటి ప్రయత్నం చేశారా?
మీరు చేసినటువంటి పాపం మొన్న మాకు శాపంగా మారి, 2024లో 19వ గేటు కొట్టుకుపోతే, మళ్లీ వాటర్ ఫ్లో ఉండగా చరిత్రలో మొదటిసారిగా ఆ గేట్ ని కూడా బిగించడమే కాదు, 33 గేట్లను కూడా కొత్తగా ఏర్పాటు చేసి, ఈరోజు ఆ తుంగభద్రలో 105 టిఎమ్సిల నీటిని నిలపగలిగేటువంటి విధంగా ఆ గేట్లను కూడా మేము ఓపెన్ చేశాం. ఐదు సంవత్సరాల మీ పాలనలో కరువు ప్రాంతానికి ఆధారమైనటువంటి తుంగభద్రా వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదో సమాధానం చెప్పాలి.
గోరుకల్లు, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడుతున్న జగన్, పోతిరెడ్డిపాడు నుంచి నీరు గోరుకల్లుకు వస్తుంది. గోరుకల్లులో రిజర్వాయర్ భద్రంగా ఉంటేనే అవుకు, గండికోట, మీ పులివెందుల చిత్రావతికి కూడా నీళ్లు రావాలంటే గోరుకల్లు భద్రంగా ఉండాలి.
అటువంటి గోరుకల్లు ప్రమాదకరంగా ఉందని ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తే ఒక్క రూపాయి గోరుకల్లు కోసం ఖర్చు పెట్టలేదు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోరుకల్లు మరమ్మతులకు 59 కోట్లు ఇచ్చి, టెండర్లు పిలిచి పనులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం.
ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి హంద్రీ-నీవా ప్రాజెక్టుకు గత ఐదు సంవత్సరాల్లో ఏం పని చేశారో చెప్పగలరా? నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీరు ఐదేళ్లలో చేయలేనటువంటి పనులు ఒక్క ఏడాదిలోనే 3,860 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, కృష్ణా జలాలను రికార్డు స్థాయిలో గత ఏడాది 55 టిఎమ్సిల నీరు హంద్రీ-నీవా నుంచి తీసుకున్నాం.
అంతేకాకుండా హంద్రీ-నీవా 400 కిలోమీటర్ల నుంచి నీవా బ్రాంచ్ కెనాల్ కూడా పనులు చేసే విధంగా, తిరుమల వరకు కూడా కృష్ణా జలాలను తీసుకెళ్లే విధంగా 1,300 కోట్ల రూపాయలతోటి పనులకు కూడా మేము శ్రీకారం చుట్టాం.
కూటమి ప్రభుత్వాన్ని వైసిపి నాయకులే మెచ్చుకుంటున్నారు.
మీ వైసిపి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డే స్వయంగా చెప్పారు, గత 5 ఏళ్ళ వైసీపీ పాలనలో రాయలసీమకి ఏం చేశామని చెప్పుకుంటాం, మోసం, దగా తప్ప చేసిందేమీ లేదని మీ నాయకులే చెబుతున్నారు. 2019 లో మీకు రాయలసీమలో రికార్డు స్దాయిలో 52 సీట్లలో 49 సీట్లకు గెలిపిస్తే, మీరు చేసినటువంటి దగా, అన్యాయం రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదనే విషయాన్ని ప్రజలుకూడా గమనిస్తున్నారు.
ఈ రెండేళ్లలోనే ఇరిగేషన్ కు 2014-19లో గత టిడిపి ప్రభుత్వం రాయలసీమకు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, మీ 5 ఏళ్ళ పాలనలో కేవలం 2,000 కోట్ల రూపాయలు రాయలసీమకి ఖర్చు పెట్టారు.
నాడే కాదు, నేడు కూడా, 2024-2026 ఈ రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ కి రాష్ట్ర వ్యాప్తంగా 27,000 కోట్లు ఖర్చు పెడితే, అందులో సగం, 50 శాతం ఇవాళ రాయలసీమకే మేము ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి.
ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇటు రాయలసీమకి గాని, ఇరిగేషన్ కి గాని ఇంత ప్రాధాన్యతనిచ్చి, ప్రాధాన్యతా క్రమంలో ఒక్కొక్క ప్రాజెక్టును హంద్రీ-నీవా దగ్గర నుంచి, గాలేరు-నగరి, వెలిగొండ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, పోలవరం ప్రాజెక్టు వరకు పూర్తి కావేమో అనేటువంటి స్థితి నుంచి లక్ష్యం పెట్టుకుని,
ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే, దాన్ని చూడలేక, ఓర్వలేక మేము చేసేటువంటి పనుల మీద గొడ్డలి పార్టీ, ఏ రకంగా విషం కక్కుతుందో మీ మాటలను బట్టే తెలస్తుంది.
ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైనటువంటి మీరు ఇటువంటి అబద్ధాలతోటి, విషం మరింత కక్కితే, ఆ 11 సీట్లు కూడా రేపు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అని హెచ్చరించారు మంత్రి నిమ్మల రామానాయుడు.




