Anantapur: ఓయో మేనేజర్ భారీ స్కెచ్.. రూ. 2.78 లక్షల నగదుతో జంప్!

Anantapur: అనంతపురంలో ఓయో రెవెన్యూ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి రూ. 2,78,400 నగదును కంపెనీ ఖాతాలో వేయకుండా సొంతానికి వాడుకుని పరారయ్యాడు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 12 May 2026 10:21 AM IST
Anantapur
X

Anantapur: ఓయో మేనేజర్ భారీ స్కెచ్.. రూ. 2.78 లక్షల నగదుతో జంప్!

Anantapur: కమలాపురం మండలం చిన్న చెప్పలికి చెందిన సిరి గిరెడ్డి వీర శ్రీకాంత్ రెడ్డి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని ఓయో హోటళ్లు, హోమ్ ల రోజువారి కలెక్షన్లు వసూలు చేసే రెవెన్యూ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.

అనంతపురంలోని కోర్టు రోడ్డులో ఉన్న హోటల్ కలెక్షన్లు సుమారు రూ.2,78,400లను వసూలు చేసి ఓయో కంపెనీ ఖాతాకు జమ చేయకుండా సొంతానికి వాడుకుని ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని పరారీ. దీంతో కంపెనీ రాష్ట్ర మేనేజర్ సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనంతపురం రెండో పట్టణ పోలీస్టేషన్లో కేసు నమోదైంది.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story