Anantapur: అనంతపురం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Anantapur: అనంతపురం అర్బన్‌లో 18 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. గత పాలనతో పోల్చితే తమ ప్రభుత్వం చేస్తున్న సాయంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కీలక వ్యాఖ్యలు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 8 July 2026 3:25 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అనంతపూర్: రెండేళ్లలోని 650 మందికి ఆరున్నర కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ కింద మేము సాయం చేస్తే.. గత వైసిపి హయాంలో కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయంలో ఆయన ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

మొత్తం 18 మందికి 11 లక్షల 30 వేల రూపాయల కు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని అన్నారు. ఓవైపు ప్రజల ఆరోగ్యంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సమపాలెంలో ముందుకు తీసుకెళుతున్నారన్నారు.

గత ఐదేళ్లలో జగన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు పెట్టి పోతే.. కేవలం ఏడాదిలోని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు కూడా అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చొరవతో 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షలు ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story