Dharmavaram: ధర్మవరం ఆసుపత్రిలో రోగులకు చల్లని ఊరట

Dharmavaram: మంత్రి సత్యకుమార్ యాదవ్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితుడై ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి మూడు కూలర్లను విరాళంగా ఇచ్చిన సికిందర్.

NAGENDRA, DHARMAVARAM
Published on: 6 May 2026 5:54 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరం ఆసుపత్రిలో రోగులకు చల్లని ఊరట

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి మూడు కూలర్లను పట్టణానికి చెందిన సికిందర్ అనే వ్యక్తి పంపిణీ చేశాడు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పై ఉన్న గౌరవంతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఆసుపత్రికి కూలర్లు అందించినట్లు తెలిపాడు.

బుధవారం ధర్మవరం బీజేపీ నేత హరీష్ బాబు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ తిపేంద్ర నాయక్ సమక్షంలో కూలర్లు అందించడం జరిగింది. ఆస్పత్రిలో రోగులు ఎండ వేడిమి కి ఇబ్బంది పడకుండా సేవా దృక్పథంతో అందించినట్లు సికిందర్ తెలిపాడు. సికిందర్ ను పలువురు అభినందించారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM

Next Story