Anantapur: 13 దొంగతనం కేసులను ఛేదించిన అనంతపురం పోలీసులు!
Anantapur: అనంతపురంలో 60 లక్షల విలువైన సొత్తుతో ఆరుగురు సభ్యుల అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ పి. జగదీష్.
Anantapur: 13 దొంగతనం కేసులను ఛేదించిన అనంతపురం పోలీసులు!
Anantapur: అనంతపురం జిల్లాలో అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు సభ్యులున్న ఈ ముఠా నుంచి సుమారు 40 తులాల బంగారం, వెండి ఆభరణాలు, లక్షా 49 వేల 500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు 60 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఈ ముఠా ప్రధానంగా రెండు రకాలుగా దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.బస్సులు, ఆటోలు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల దృష్టి మళ్లించి మహిళలు, వృద్ధుల వద్ద నుంచి బ్యాగులు, పర్సులు, ఆభరణాలను చోరీ చేసేవారు.అలాగే గుజరీ ఏరుకునే వారి ముసుగులో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి, ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ ముఠాలోని వనార్చి చిట్టెమ్మ బ్యాగ్ లిఫ్టింగ్ చోరీల్లో ఆరితేరిన పాత నేరస్తురాలిగా పోలీసులు గుర్తించారు.
బస్సులు, ఆటోలు, ఆర్టీసీ బస్స్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల్లా నటిస్తూ తోటి ప్రయాణికుల దృష్టి మళ్లించి బ్యాగులు, పర్సులను అపహరించేవారని తెలిపారు.మిగిలిన ఐదుగురు నిందితులు పరస్పరం బంధువులు, పరిచయస్తులుగా పోలీసులు గుర్తించారు.సులువుగా డబ్బు
సంపాదించాలనే ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు.ఈ ఆరుగురి అరెస్టుతో గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కేసులు, అనంతపురం 3వ టౌన్లో ఒక కేసు, ఉరవకొండలో ఒక కేసు కలిపి మొత్తం 13 దొంగతనం కేసుల్లో పురోగతి సాధించినట్లు జిల్లా ఎస్పీ పి. జగదీష్ తెలిపారు.
శనివారం అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ పి. జగదీష్ అరెస్టు వివరాలు, కేసుల ఛేదన, స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలను వెల్లడించారు.కేసులను వేగంగా ఛేదించిన గుత్తి పోలీసులు, సీసీఎస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేకంగా అభినందించారు.




