Kalyanadurgam: కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్ల నిరసన

Kalyanadurgam: జీవో 396 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్ల నిరవధిక పెన్‌డౌన్.

P.Sudhakar, Anantapuram
Published on: 24 July 2026 7:46 PM IST
Kalyanadurgam
X

Kalyanadurgam: కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్ల నిరసన

Kalyanadurgam: కళ్యాణదుర్గంలో జీవో నెం.396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన నిరవధిక పెన్‌డౌన్ ఉద్యమం ఐదో రోజుకు చేరుకుంది. రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్స్ సంఘం పిలుపు మేరకు కళ్యాణదుర్గం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు నిరసన కొనసాగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జీవో–396 అమలుతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న దస్తావేజు లేఖరుల ఉపాధికి ఈ జీవో ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ప్రజలకు సులభంగా అందుతున్న సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశముందని వారు అభిప్రాయపడ్డారు.

రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంచాలనే పేరుతో తీసుకొచ్చిన జీవో–396 వల్ల సమస్యలు మరింత పెరిగే అవకాశముందని డాక్యుమెంట్ రైటర్లు పేర్కొన్నారు. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకుని దస్తావేజు లేఖరుల హక్కులు, ఉపాధిని పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 31వ తేదీ వరకు నిరవధిక పెన్‌డౌన్ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను సానుకూలంగా పరిశీలించి జీవో–396ను రద్దు చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

డాక్యుమెంట్ రైటర్ల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి, సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని వారు కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు స్పష్టం చేశారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story