Anantapur: అనంతపురంలో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ!
Anantapur: నగరంలోని శ్రీనగర్ కాలనీలో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. గత ప్రభుత్వంపై విమర్శలు.
Anantapur: అనంతపురంలో రూ.80 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ!
Anantapur: అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీ లో ఉన్న నీరు ప్రగతి పార్క్ సర్కిల్ వద్ద 80 లక్షలతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్.
ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 1300 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేసామన్నారు.
గత ఐదేళ్లలో ఎక్కడా కూడా రోడ్లు డ్రైనేజీలు వేసిన పాపాన పోలేదన్నారు. కనీసం కాలువలు శుభ్రం చేసిన పరిస్థితి కూడా లేదన్నారు. కేవలం ఏదో చేస్తున్నామని చెప్పి మభ్యపెట్టి దొంగ బిల్లులు చేసుకున్నారని విమర్శలు చేశారు.




