Anantapur: అనంతపురంలో రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్!

Anantapur: రాయదుర్గంలో రూ.10,000 కోట్ల వ్యయంతో 1,325 MW పవన విద్యుత్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన. 4,000 మందికి ఉపాధి అవకాశాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 Aug 2026 11:28 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో రూ.10 వేల కోట్లతో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్ట్!

Anantapur: ఇవాళ అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్ పర్యటించనున్నారు. రాయదుర్గంలో 10 వేల కోట్ల రూపాయల విలువైన 13 వందల 25 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. హాలుగుంది దగ్గర సుజలన్ విండ్స్ తయారీ కేంద్రాన్ని సందర్శించనున్నారు.

అనంతరం నల్లంపల్లి దగ్గర పార్టీ నేతలు, కార్యక్రర్తలతో సమావేశం అవుతారు. 2030 నాటికి 5 వేల మెగావాట్ల అదనపు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల స్థాపనే లక్ష్యంగా ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story