Penukonda: పెనుకొండలో ఆధ్యాత్మిక వేడుక!
Penukonda: పెనుకొండ ఐ ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు. పాల్గొన్న టీడీపీ అబ్జర్వర్ డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు, కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి రమణ.
Penukonda: పెనుకొండలో ఆధ్యాత్మిక వేడుక!
Penukonda: పెనుకొండ పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఐ ముక్తేశ్వర శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ డాక్టర్ గోగిశెట్టి నరసింహారావు, రాష్ట్ర ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ రంగేపల్లి రమణ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు, నాయకులు త్రివేంద్ర ప్రభంజన్ స్వామి, పులుగూరి శ్రీనివాసులు, బోయ నంజుండ సుబ్రహ్మణ్యం, బోయ సోము, కోమటి నంజప్ప, ఆలయ పూజారి ఖన్నా స్వామి తదితరులు పాల్గొని శివుని ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా కొనసాగాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు నాయకులు తెలిపారు.




