Pamidi: పామిడిలో అరుదైన విట్టల్ కోటి స్తూపం ఆవిష్కరణ

Pamidi: అనంతపురం జిల్లా పామిడిలోని విఠోభా ఆలయంలో విట్టల్ కోటి పుస్తకాల స్తూపాన్ని పండరీపూర్ పీఠాధిపతులు ఘనంగా ఆవిష్కరించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 25 Jun 2026 7:25 PM IST
Pamidi
X

Pamidi: పామిడిలో అరుదైన విట్టల్ కోటి స్తూపం ఆవిష్కరణ

పామిడి: అనంతపురం జిల్లా పామిడి పట్టణం లో "విట్టల్ "కోటి వ్రాసిన పుస్తకాల నిల్వ చేసే స్థూపాన్ని శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్బంగా పాండరీపూర్ శ్రీక్షేత్ర బోధలే బాబా గురుపరంపార 10,11పిఠాధిపతులు ప్రభాకర్ బోధలే మహారాజ్, యశ్వంత్ మహారాజ్ లు ఆవిష్కరించారు.

వందలాది విట్టల్ కోటి నామ లిఖిత పుస్తకాల కు శాస్తోక్తంగా వేద మంత్రాలతో పూజలు చేశారు. అనంతరం వాటిని మహిళ భక్తులు తలపై ఉంచుకొని స్థూపం లో చేర్చారు. వందలాది మంది భక్తులు పాండురంగ విట్టల నామాన్ని స్మరిస్తుండగా ఆవిష్కరణ చేశారు.

డబ్బిదార్ ఫిర్కా విటోభ ఆలయం లో స్థూపం నిర్మించారు. రామకోటి స్థూపలు రాష్ట్రంలో ఎన్నో ఉండగా విట్టల్ కోటి స్థూపం ఒక్కటే. భావసారా క్షత్రియ భజన మండలి వారిచే నిర్మంచ బడింది

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story