Jendadibba: రేపు జండాదిప్పలోమంత్రి ఆనం పర్యటన

Jendadibba: నెల్లూరు జిల్లా జెండాదిబ్బ గ్రామంలో రేపు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 31 March 2026 9:33 PM IST
Jendadibba
X

Jendadibba: రేపు జండాదిప్పలోమంత్రి ఆనం పర్యటన

Jendadibba: రేపు జెండాదిబ్బ గ్రామంలో మంత్రి ఆనం చేతుల మీదగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ తో పాటు. రెండు కోట్ల 25 లక్షల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవలు,శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు జండా దిబ్బలోని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించనున్నారు.

అనంతరం గ్రామంలో 1కోటి 51 లక్షలతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు అలాగే అసంపూర్తి ఉన్న విలేజ్ హెల్త్ సెంటర్ భవనకు 27 లక్షలతో పనులు ప్రారంభించనున్నారు.కేంద్ర ప్రభుత్వ ద్వారా జలజీవన్ మిషన్ నిధులతో 44.5 లక్షలతో చేపట్టనున్న రక్షిత మంచినీటి సరఫరా పథకానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ కార్యక్రమానికి తెలుగుదేశం,జనసేన,బీజేపీ నేతలు,అభిమానులు కార్యకర్తలు పాల్గొనాలని ఒక ప్రకటనలో తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story