Srikalahasti: మృత్యువును జయించి.. గాయాలతోనే పది పరీక్షకు!
Srikalahasti: ఒంటిపై తీవ్ర గాయాలతో ఓ విద్యార్థి 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. ఈ నెల 10వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని తొండమనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది.
Srikalahasti: మృత్యువును జయించి.. గాయాలతోనే పది పరీక్షకు!
Srikalahasti: ఒంటిపై తీవ్ర గాయాలతో ఓ విద్యార్థి 10వ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. ఈ నెల 10వ తేదీన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని తొండమనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జడ్పీ స్కూల్కు చెందిన ముగ్గురు విద్యార్థులు బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
అందులో రేవంత్ అనే బాలుడు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఒక విద్యార్థి ఇవాళ పరీక్షలు ప్రారంభం కావడంతో ఒంటిపై పూర్తిగా గాయాలు, కట్లతోనే నేరుగా పరీక్ష కేంద్రానికి వెళ్లాడు. మరో విద్యార్థి ధనుష్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందితున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు.
Next Story




