Nellore: మహిళా విభాగం పటిష్టతే లక్ష్యం నెల్లూరు సదస్సులో కాకాణి పూజిత
Nellore: నెల్లూరు నగరం గాంధీనగర్లోని RSN కళ్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో మహిళా సదస్సు జరిగింది.
Nellore: మహిళా విభాగం పటిష్టతే లక్ష్యం నెల్లూరు సదస్సులో కాకాణి పూజిత
Nellore: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్యంలో నెల్లూరు నగరం ,గాంధీ నగర్ లోని RSN కళ్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ స్థాయి, వార్డు స్థాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగాలకు అధ్యక్షులుగా నియమితులైన మహిళలతో సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుడు కళ్యాణి , స్థానిక మహిళా నేతలు, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సదస్సుకు భారీ స్పందన లభించింది..భారీగా తరలివచ్చిన మహిళలు తమ స్పందనను తెలియజేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అనేక అఘాయిత్యాలను, ఆకృత్యాలను, మహిళలు సభలో చర్చించారు. నెల్లూరు మహిళా సదస్సుకు విచ్చేసిన వరుదు కళ్యాణి, విజయవంతం చేసిన స్థానిక మహిళా నేతలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు కాకాణి పూజిత.




