Palasa: పలాసలో భారీ భూ కుంభకోణం? రూ.10 కోట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఎమ్మెల్యేకు వినతి!

పలాస-కాశీబుగ్గ: పలాస మున్సిపాలిటీ పరిధిలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 12 March 2026 2:08 PM IST
Palasa: పలాసలో భారీ భూ కుంభకోణం? రూ.10 కోట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఎమ్మెల్యేకు వినతి!
X

Palasa: పలాసలో భారీ భూ కుంభకోణం? రూ.10 కోట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఎమ్మెల్యేకు వినతి!

పలాస-కాశీబుగ్గ: పలాస మున్సిపాలిటీ పరిధిలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. నకిలీ పత్రాల సృష్టించి కోట్ల విలువైన భూమిని కొందరు కబ్జా చేశారని ఆరోపిస్తూ పట్టణ ముఖ్య నాయకులు పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారికి వినతి పత్రం సమర్పించారు.

గత ప్రభుత్వ హయాంలోనే కబ్జా?

29వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి జోగ మల్లేశ్వరరావు ఈ భూ ఆక్రమణపై సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపాలిటీ 2వ వార్డులోని మదర్ థెరీసా స్కూల్ వెనుక ఉన్న సర్వే నెం. 28లో సుమారు 1.84 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో (2019-2024 మధ్య) కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రధాన అంశాలు:

ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం విలువ రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అధికారులను తప్పుదోవ పట్టించి నకిలీ పత్రాలతో ఈ ఆక్రమణకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతటి శక్తివంతులైనా సరే, సమగ్ర విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని నాయకులు కోరారు.

ఎమ్మెల్యే హామీ

వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే గౌతు శిరీష గారు సానుకూలంగా స్పందించారు. ఈ భూ వివాదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని, ఆక్రమణదారుల పై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని హాజరైన నాయకులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూములను కాపాడటంలో రాజీ పడేది లేదని ఆమె స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story