Nandyala: వేద మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు చేపట్టిన నంద్యాల కలెక్టర్!
Nandyala: నంద్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బాధ్యతలు చేపట్టారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.
Nandyala: వేద మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు చేపట్టిన నంద్యాల కలెక్టర్!
Nandyala: నంద్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్ పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నంద్యాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు.
బుధవారం ఆమె మున్సిపల్ కార్యాలయానికి చేరుకోగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె తన ఛాంబర్లో రికార్డుల్లో తొలి సంతకం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజకుమారి గణియా, నంద్యాల పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. భవిష్యత్తులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో నంద్యాలను ప్రథమ స్థానంలో నిలిపే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్ప యాదవ్, డి.ఇలు నాగభూషణ్ రెడ్డి, పవన్, రసూల్, ఏసీబీ నరసింహమూర్తి, రెవెన్యూ అధికారులు వెంకటరెడ్డి, శానిటేషన్ అధికారులు మురళి, శివప్రసాద్ రెడ్డి, లక్ష్మీనారాయణ, హిమబిందు, శశాంత్ తదితరులు పాల్గొన్నారు.




