Vadamalapeta: రెండు లారీలు ఢీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Vadamalapeta: వడమాలపేట అంజేరమ్మ కనుమ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొనడంతో క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 3 April 2026 7:51 PM IST
Vadamalapeta
X

Vadamalapeta: రెండు లారీలు ఢీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Vadamalapeta: చెన్నై తిరుపతి జాతీయ రహదారిలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ. వడమాల పేట అంజేరమ్మ కనుమ సమీపంలోని గోశాల వద్ద రోడ్డు ప్రమాదపు ఘటన. ఢీ కొన్న లారీ నుజునుజు -డ్రైవర్ కు తీవ్ర గాయాలు.

క్షతగాత్రుడు తమిళనాడు చెన్నై కి చెందిన భాస్కర్ గా (50)గుర్తింపు. క్షతగాత్రున్ని ప్రధమ చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story