ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Vontimitta Sitarama Kalyanam: ఒంటిమిట్టలో కనులపండువగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు.

Arun Chilukuri
Published on: 2 April 2026 10:58 AM IST
Vontimitta Sitarama Kalyanam
X

ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Vontimitta Sitarama Kalyanam: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవ కార్యక్రమాన్ని కనులపండువగా జరిగింది. సీఎం చంద్రబాబు దంపతులు హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణమహోత్సవం తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణానికి ముందు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. తెలుగువారి పెళ్లి సంప్రదాయాలను ఈ ఉత్సవం ఎంతో భక్తిశ్రద్దలతో వీక్షించారు.

రాష్ట్ర ప్రజలందరిపై సీతారాముల ఆశీస్సులు ఉండాలని.. అందరూ సుఖసంతోషాలతో వర్లిల్లాలని కోరుకున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఒంటిమిట్ట వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పారు. ఒంటిమిట్ట క్షేత్రాన్ని కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా.. అంతర్జాతీయ స్తాయి టెంపుల్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story