Amaravati: అమరావతికి కేంద్రం మెగా ప్రాజెక్ట్.. రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్!
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
Amaravati: అమరావతికి కేంద్రం మెగా ప్రాజెక్ట్.. రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్!
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వైభవాన్ని చాటేలా కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సరికొత్తగా ‘సెంట్రల్ సెక్రటేరియట్’ (Central Secretariat) నిర్మాణానికి సంబంధించి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD) పంపిన ప్రతిపాదనలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మెగా ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.2,534 కోట్లు కేటాయించింది.
కేంద్ర కేబినెట్ ఆమోదించిన మొత్తం నిధులను రెండు ప్రధాన విభాగాల కోసం వ్యూహాత్మకంగా ఖర్చు చేయనున్నారు. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల (కార్పొరేట్ ఆఫీసులు, రీజినల్ హెడ్క్వార్టర్స్) సముదాయం కోసం రూ.1,299.08 కోట్లు వెచ్చించనున్నారు. కేంద్ర ఉద్యోగుల క్వార్టర్స్: అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వసతి కోసం అత్యాధునిక మల్టీస్టోరేజ్ (బహుళ అంతస్తుల) నివాస సముదాయాల నిర్మాణానికి రూ.1,234.91 కోట్లు కేటాయించారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) ఇప్పటికే 22.53 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ల్యాండ్ లేఅవుట్ ప్రకారం.. 5.53 ఎకరాల్లో: అత్యాధునిక హంగులతో సెంట్రల్ సెక్రటేరియట్ భవన సముదాయం నిర్మిస్తారు. 17 ఎకరాల్లో: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం గ్రీన్ హౌసింగ్ నివాస సముదాయాన్ని (Residential Complex) ఏర్పాటు చేయనున్నారు.
కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట కొలువుదీరనుండటంతో రాజధాని ప్రాంతంలో ఆర్థిక, పరిపాలనా కార్యకలాపాలు ఊపందుకుంటాయని ఏపీ రాజకీయ, పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.




