Pawan Kalyan: నేషనల్ వార్ మెమోరియల్లో అమరవీరులకు పవన్ ఘన నివాళి!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ను సందర్శించి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు.
Pawan Kalyan: నేషనల్ వార్ మెమోరియల్లో అమరవీరులకు పవన్ ఘన నివాళి!
Pawan Kalyan: దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించారు. భారత సైనికుల ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగాలకు ప్రతీకగా నిలిచిన ఈ స్మారక చిహ్నం వద్ద ఆయన ఘన నివాళులు అర్పించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమరస్థూపం వద్ద పుష్పగుచ్ఛం సమర్పించి వీర జవాన్లకు వందనం చేశారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన సైనికుల సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సైనికాధికారులు కల్నల్ ఆర్.కె. ఆనంద్, కెప్టెన్ రోహిత్ గార్గ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అమరవీరుల త్యాగగాథలను ఆసక్తిగా తెలుసుకున్నారు. దేశ భద్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన జవాన్ల జీవిత విశేషాలను అధికారులు వివరించగా ఆయన శ్రద్ధగా ఆలకించారు. అమరవీరుల సేవలను స్మరించుకునే అవకాశం దక్కడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. భారత సైనికుల అంకితభావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు.
అనంతరం వార్ మెమోరియల్లోని త్యాగచక్రను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి, అక్కడ చెక్కిన అమర జవాన్ల పేర్లను పరిశీలించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వీర సైనికుడు జి.ఎన్.ఆర్. సతీష్తో పాటు పలువురు అమరవీరుల పేర్లు ఉన్న గ్రానైట్ ఫలకాల వద్ద నివాళులు అర్పించారు. అలాగే శౌర్యచక్ర అవార్డు గ్రహీత రాజ్ కుమార్, హావల్దార్ అరుణ్ కుమార్ పేర్ల వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాలు దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
వార్ మెమోరియల్లోని నాలుగు స్మారక చక్రాల విశేషాలను కూడా పవన్ కళ్యాణ్ సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ వేలాది మంది సందర్శకులు ఇక్కడికి వచ్చి తమకు స్ఫూర్తిగా నిలిచిన జవాన్ల పేర్లు చెక్కిన ఫలకాలకు నివాళులు అర్పిస్తారని అధికారులు వివరించారు. దేశభక్తి భావనతో వచ్చే ప్రతి ఒక్కరూ ఈ స్మారకాన్ని ఓ పవిత్ర దేవాలయంలా భావిస్తారని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ను కూడా భావోద్వేగానికి గురిచేశాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించిన ఈ కార్యక్రమం దేశభక్తి, జాతీయ స్పూర్తిని ప్రతిబింబించే ఘట్టంగా నిలిచింది. పవన్ కళ్యాణ్ సందర్శనతో నేషనల్ వార్ మెమోరియల్ మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది.




