New Pensions: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా 3 లక్షల పింఛన్లు, సెప్టెంబర్‌లోనే దరఖాస్తుల స్వీకరణ!

New Pensions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 3 లక్షల పింఛన్ల అందజేతకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Arun Chilukuri
Published on: 26 Aug 2026 10:18 AM IST
New Pensions
X

New Pensions: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్తగా 3 లక్షల పింఛన్లు, సెప్టెంబర్‌లోనే దరఖాస్తుల స్వీకరణ! 

New Pensions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ఎన్టీఆర్ భరోసా' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3 లక్షల మందికి సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (SERP) అధికారులు కార్యాచరణను పూర్తి చేశారు.

ప్టెంబరు రెండో వారం నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. సెప్టెంబరులో దరఖాస్తుల వడపోత, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, అక్టోబరు నుంచి అర్హులకు కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నారు.

మొదటి ప్రాధాన్యంగా వితంతువులు, వృద్ధులకు ఈ పింఛన్లు అందజేయనున్నారు. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రాతిపదికన ప్రాథమికంగా 1.50 లక్షల మంది వితంతువులు, 1.50 లక్షల మంది వృద్ధులను గుర్తించినట్లు సమాచారం.

చేనేత కార్మికులు, గీత కార్మికులు, చర్మకారులు, డప్పు కళాకారులు వంటి వృత్తిపరమైన పింఛన్ల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ కేటగిరీల వారితో పాటు దివ్యాంగులకు తదుపరి విడతల్లో ప్రాధాన్య క్రమంలో పింఛన్లు మంజూరు చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story