Weather Update: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
Weather Update: ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) కీలక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది.
Weather Update: ఏపీ ప్రజలకు అలెర్ట్.. రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
Weather Update: ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులపై ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజాగా పలు జిల్లాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర పరిసర జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ 'ఆరెంజ్ అలర్ట్' (Orange Alert) ప్రకటించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోని గజపతినగరం, శృంగవరపుకోట మరియు విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు రాయలసీమ ప్రాంతంలోని అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.
తీవ్రమైన పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వర్షం పడే సమయంలో పొలాల్లోని బహిరంగ ప్రదేశాల్లో లేదా ఎత్తైన చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు.
ప్రతి ఒక్కరూ కాంక్రీట్ భవనాలు లేదా సురక్షితమైన ప్రదేశాలలో ఉండాలి.
అవసరం లేకపోతే వర్షాల సమయంలో ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం.




