Polavaram: రంపచోడవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం.. గిరిజనులకు ₹5కే భోజనం!

Polavaram: రంపచోడవరం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటీన్‌ను ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రారంభించారు.

PRASANNA, RAMACHANDRAPURAM
Updated on: 15 April 2026 2:06 PM IST
Polavaram
X

Polavaram: రంపచోడవరంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం.. గిరిజనులకు ₹5కే భోజనం!

పోలవరం జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అన్నా క్యాంటీన్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటీన్‌ను రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె క్యాంటీన్‌కు వచ్చిన ప్రజలకు టోకెన్లు పంపిణీ చేసి స్వయంగా భోజనాన్ని వడ్డించారు.

రాష్ట్రంలో సుమారు 62 అన్నా క్యాంటీన్‌లు ప్రారంభించబడుతున్న నేపథ్యంలో, నిరుపేదలకు కేవలం ₹5కే పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి, ముఖ్యంగా చింతూరు ఐటిడిఏకు వివిధ పనుల నిమిత్తం వచ్చే గిరిజనులకు ఈ అన్నా క్యాంటీన్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. రంపచోడవరం నియోజకవర్గానికి రెండు అన్నా క్యాంటీన్‌లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా, వెంటనే ఆమోదం తెలిపినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కొల్లుబోయిన వేణుగోపాల్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్ల సునీత, మాజీ ఎమ్మెల్యేలు చిన్నం బాబు రమేష్, సీతంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు, అలాగే 12 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

PRASANNA, RAMACHANDRAPURAM

PRASANNA, RAMACHANDRAPURAM

Next Story