Chandrababu: ఎన్‌డీఏ పాలనలో ఏపీకి భారీ పెట్టుబడులు.. రూ.2.08 లక్షల కోట్ల ప్రతిపాదనలకు SIPB ఆమోదముద్ర!

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ ఎస్ఐపీబీ (SIPB) సమావేశం. పరిశ్రమలు, ఐటీ, విద్యుత్ రంగాల్లో రూ.2.08 లక్షల కోట్ల విలువైన 37 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఆమోదం.

Arun Chilukuri
Published on: 12 Aug 2026 2:19 PM IST
Chandrababu
X

Chandrababu: ఎన్‌డీఏ పాలనలో ఏపీకి భారీ పెట్టుబడులు.. రూ.2.08 లక్షల కోట్ల ప్రతిపాదనలకు SIPB ఆమోదముద్ర!

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద్యోగ కల్పనయే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) కీలక సమావేశం నిర్వహించింది.

పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలకు చెందిన మొత్తం 37 ప్రతిపాదనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. దాదాపు రూ.2.08 లక్షల కోట్ల భారీ పెట్టుబడి ప్రతిపాదనలకు ఈ భేటీలో ఆమోదం లభించింది.

రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పునరుత్పాదక విద్యుత్, ఐటీ, పర్యాటక రంగం, ఆహార శుద్ధి పరిశ్రమలు, తయారీ రంగాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

మంత్రులు కే. అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్‌లతో పాటు సీఎస్ సాయిప్రసాద్ మరియు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ఈ కీలక SIPB సమావేశం ద్వారా ఏపీకి భారీగా పారిశ్రామిక వేగం పుంజుకోనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story