Vizianagaram: బాధితుల ఇంటికే ముఖ్యమంత్రి సహాయ నిధి

Vizianagaram: విజయనగరం జిల్లా గుర్ల మరియు గరివిడి మండలాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పర్యటించారు.

G SIMHACHALAM,	CHIPURPALLY
Updated on: 8 April 2026 6:31 PM IST
Vizianagaram
X

Vizianagaram: బాధితుల ఇంటికే ముఖ్యమంత్రి సహాయ నిధి

Vizianagaram: గుర్ల మరియు గరివిడి మండలాలలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కుల పంపిణీ చేసిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు. గుర్ల మరియు గరివిడి మండలాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యువ నాయకులు శ్రీ కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పర్యటించారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను ఆయన స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు.

ఈ సందర్భంగా రామ్ మల్లిక్ నాయుడు మాట్లాడుతూ.. నిరుపేదలకు ఆపద సమయంలో అండగా నిలవడమేకూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ నిధులను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

నేడు చెక్కులు అందుకున్న లబ్ధిదారులు:

దాసరి సూరమ్మ: రూ. 1,42,290/-

దాసరి గోవింద్: రూ. 66,900/-

కరిమజ్జి పెంటమ్మ: రూ. 43,364/-

మీసాల అప్పలనాయుడు: రూ. 1,42,862/-

మొత్తం 3,95,416 రూపాయలు అందించారు. గరివిడి మండలం లో బసవ తిరుమలరావు ₹43,306. రెండు మండలాల్లో అత్యధిక మొత్తంలో సహాయం అందడంతో లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని గుర్తించి, ఇంటి వద్దకే వచ్చి చెక్కులు అందజేసిన కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G SIMHACHALAM,	CHIPURPALLY

G SIMHACHALAM, CHIPURPALLY

Next Story