Mudigubba: ఉపాధి పనుల తనిఖీలో మంత్రి నిరాడంబరత.. కూలీల హర్షం

Mudigubba: శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో ఉపాధి హామీ పనులను మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిశీలించారు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 19 April 2026 5:25 PM IST
Mudigubba
X

Mudigubba: ఉపాధి పనుల తనిఖీలో మంత్రి నిరాడంబరత.. కూలీల హర్షం

Mudigubba: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం భూదనం పల్లి లో ఉపాధి హామీ పనులను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మంత్రి ముచ్చటించడం జరిగింది.పనులు జరుగుతున్నప్పుడు,

వచ్చే ఆదాయం కుటుంబ వ్యక్తిగత విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇదే సందర్భంలో కూలీలు అల్పాహారం తినే సమయంలో మంత్రిని ఆహ్వానించగా మంత్రి సత్య కుమార్ వారితో కలిసి కింద కూర్చొని కూలీలు తెచ్చిన అల్పాహారాన్ని ఇష్టంగా భోంచేశారు. తమ మధ్య మంత్రి కూర్చుని అల్పాహారం తినడంతో కూలీలు సంతోషం వ్యక్తపరిచారు.రాష్ట్రానికి మంత్రి అయ్యుండొచ్చు నేను కూడా సామాన్య కుటుంబీకుడినే అంటూ మంత్రి మరోసారి తన నిరాడంబరత్వాన్ని ప్రదర్శించారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story