Ongole: వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఘోరం.. ఒంగోలు వైసీపీ ఆఫీసులోనే ఇరు వర్గాల పరస్పర దాడి!
Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఘోర కలకలం రేగింది.
Ongole: వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఘోరం.. ఒంగోలు వైసీపీ ఆఫీసులోనే ఇరు వర్గాల పరస్పర దాడి!
Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ శ్రేణులు ఘర్షణకు పాల్పడ్డారు. వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరిపై ఒకరు పరిస్పరం దాడికి చేసుకున్నారు. ఎస్టీసెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మరో మహిళ నేత మేరి తన భర్త శ్రీనుతో కలిసి ప్రసన్నపై దాడి చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వైసీపీ జిల్లా నేతలు జోక్యం చేసుకున్నారు. మేరి, పేరం ప్రసన్న మధ్య గతంలోనే వ్యక్తిగత, రాజకీయ విభేదాలు ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో పార్టీ కార్యాలయంలో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story




