Road Accident: పల్నాడులో ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవదహనం!

Road Accident: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 1 July 2026 10:40 AM IST
Road Accident
X

Road Accident: పల్నాడులో ఘోర ప్రమాదం.. రెండు లారీలు ఢీకొని నలుగురు సజీవదహనం!

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యడ్లపాడు మండలం బోయపాలెం దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో నలుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు లారీ డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు ఉన్నారు. సమాచారం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలు అదుపు చేశారు. ఆగి ఉన్న లారీ చిలకలూరిపేట నుంచి గుంటురు వెళ్తుంది. ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story