Beeda Masthan Rao: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ను కలిసిన బీద మస్తాన్ రావు
Beeda Masthan Rao: రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ న్యూ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కీలక వ్యక్తులను మర్యాదపూర్వకంగా కలిశారు.
Beeda Masthan Rao: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ను కలిసిన బీద మస్తాన్ రావు
Beeda Masthan Rao: రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ న్యూ ఢిల్లీ లో డా. హరివంశ్ నారాయణ్ సింగ్ జీ రాజ్యసభ ఉపసభాపతిగా వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పార్లమెంట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ని, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ (బీజేపీ)ని వారి ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
Next Story




