ఆపరేషన్ విజయవంతం కోలుకుంటున్నానన్న వైఎస్ షర్మిల

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చింది.

Srinivas Rao
Updated on: 26 July 2026 1:45 PM IST
YS Sharmila
X

ఆపరేషన్ విజయవంతం కోలుకుంటున్నానన్న వైఎస్ షర్మిల

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చింది. ఇటీవల ఆమెకు వైద్యులు ఉదర శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ సర్జరీ అనంతరం ప్రస్తుతం ఆమె వేగంగా కోలుకుంటున్నట్లు స్వయంగా వైఎస్ షర్మిల ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.

శ్రేయోభిలాషులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు..

ఈ క్లిష్ట సమయంలో తన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికీ షర్మిల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆత్మీయత, ప్రార్థనలు, మరియు అండదండలు తనకు కొండంత బలాన్ని నిలిచాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుని ప్రజల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రజలు , ఇతర రాజకీయ నాయకులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షలను వ్యక్తం చేస్తున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story