Ambati Rambabu: ఇంధన ధరలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం.. రిక్షా తొక్కి నిరసన తెలిపిన మాజీ మంత్రి అంబటి

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైఎస్సార్‌సీపీ గుంటూరులో భారీ ఆందోళన చేపట్టింది.

Arun Chilukuri
Published on: 18 May 2026 4:38 PM IST
Ambati Rambabu
X

Ambati Rambabu: ఇంధన ధరలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం.. రిక్షా తొక్కి నిరసన తెలిపిన మాజీ మంత్రి అంబటి

Ambati Rambabu: గుంటూరులో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రిక్షా తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. కూటిమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఇదేనా సంపద సృష్టి, ఇదేనా సుపరిపాలన అంటూ ప్రశ్నించారు.

ఎన్నికల సమయంలో రాష్ట్ర పన్నులు తగ్గించి ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్.. ఇప్పుడు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కమీషన్లు వచ్చే పనులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు ఎలాంటి పొంతన లేదని.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story