Toll Booths: మార్చి నాటికి బ్యారియర్లు లేని టోల్‌బూత్‌లు.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!

Toll Booths: 2027 మార్చి నాటికి బ్యారియర్లు లేని టోల్‌బూత్‌లు అందుబాటులోకి వస్తాయని నితిన్ గడ్కరీ తెలిపారు. ANPRతో ఆటోమేటిక్ టోల్ వసూలు జరగనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 1:17 AM IST
Toll Booths
X

Toll Booths: మార్చి నాటికి బ్యారియర్లు లేని టోల్‌బూత్‌లు.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన!

Toll Booths: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు మరింత వేగవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. 2027 మార్చి నాటికి దేశంలోని టోల్‌ప్లాజాల వద్ద బ్యారియర్లను పూర్తిగా తొలగించనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ముంబైలో నిర్వహించిన 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026'లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఒకప్పుడు టోల్‌ప్లాజాల వద్ద సగటున 12 నుంచి 30 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వచ్చేదని, ఫాస్టాగ్ (FASTag) అందుబాటులోకి వచ్చాక ఆ సమయం 80 నుంచి 90 శాతం వరకు తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. బ్యారియర్లు లేని ఉచిత ప్రవాహ టోలింగ్ విధానం ద్వారా వాహనాలు ఆగాల్సిన అవసరమే ఉండదని వివరించారు. దీనికోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) సాంకేతికతను ఫాస్టాగ్‌తో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు.

ఈ నూతన విధానం వల్ల దేశవ్యాప్తంగా ఏటా రూ. 5,250 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవ్వడంతో పాటు, నిరంతర వాహన రాకపోకల వల్ల ప్రభుత్వానికి ప్రతిఏటా అదనంగా రూ. 10,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని గడ్కరీ అంచనా వేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికే 70 శాతం టోల్‌ప్లాజాల వద్ద బ్యారియర్లను తొలగిస్తామని, 2027 మార్చి నాటికి 100 శాతం ప్రక్రియ పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్