EPFO: ఖాతాదారులకు బిగ్ అలెర్ట్.. మనీ విత్ డ్రాలో కొత్త రూల్స్ ఇవిగో.!
EPFO: ఈపీఎఫ్వో అడ్వాన్స్ మనీ విత్డ్రా నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. అనారోగ్యం, చదువు, పెళ్లి, ఇల్లు కొనుగోలు వంటి వివిధ అవసరాల కోసం పీఎఫ్ డబ్బులు ఎన్నిసార్లు డ్రా చేసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
EPFO: ఖాతాదారులకు బిగ్ అలెర్ట్.. మనీ విత్ డ్రాలో కొత్త రూల్స్ ఇవిగో.!
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈపీఎఫ్వోలో ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తున్న కేంద్రం, తాజాగా పీఎఫ్ ఖాతా నుంచి అడ్వాన్స్ మనీ విత్డ్రా చేసుకునే నిబంధనల్లో కొత్త రూల్స్ తీసుకువచ్చింది. వివిధ అవసరాల నిమిత్తం పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునే వారికి ఈ నిబంధనలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
పీఎఫ్ ఖాతాదారులు తమ అవసరాల కోసం అడ్వాన్స్ అమౌంట్ తీసుకునే పరిమితులను ఈపీఎఫ్వో స్పష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం, అనారోగ్య కారణాలతో అయితే ఖాతాదారులు అవసరాన్ని బట్టి ఎన్నిసార్లైనా తమ పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే పిల్లల ఉన్నత చదువుల కోసం గరిష్టంగా 10 సార్లు, వివాహ అవసరాల కోసం 5 సార్లు పీఎఫ్ నగదును తీసుకునే సదుపాయం కల్పించింది. అంతేకాకుండా, ఇల్లు కొనడం, నిర్మాణం చేయడం, హోమ్ లోన్ రీపేమెంట్, లేదా ఇంటి మరమ్మతుల కోసం 5 సార్లు, మరికొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2 సార్లు అడ్వాన్స్ పొందే అవకాశాన్ని ఇచ్చింది.
అయితే, ఖాతాదారులు ఈ అడ్వాన్స్ నగదు తీసుకోవాలంటే ఒక ప్రధాన షరతు విధించింది. సదరు ఉద్యోగి ఈపీఎఫ్ మెంబర్షిప్ తీసుకుని కనీసం 12 నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ అడ్వాన్స్ విత్డ్రాలకు అర్హులు అవుతారని స్పష్టం చేసింది. ఈ అర్హతలు ఉన్న ఖాతాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం అమౌంట్లో గరిష్టంగా 75 శాతం వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉందని ప్రభుత్వం ఈ సందర్భంగా వెల్లడించింది.




