Gold Price Crash: పాతాళానికి పసిడి.. 40 ఏళ్లలో లేనంత దారుణంగా పడిపోయిన బంగారం ధరలు!
Gold Price Crash: సాధారణంగా యుద్ధం వచ్చిందంటే చాలు.. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు పరుగులు తీస్తారు.
Gold Price Crash: పాతాళానికి పసిడి.. 40 ఏళ్లలో లేనంత దారుణంగా పడిపోయిన బంగారం ధరలు!
Gold Price Crash: సాధారణంగా యుద్ధం వచ్చిందంటే చాలు.. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు పరుగులు తీస్తారు. కానీ, ప్రస్తుత ఇరాన్ యుద్ధం పసిడి మార్కెట్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. గత వారం రోజుల్లోనే బంగారం ధర 11 శాతం మేర క్షీణించి, 1983 తర్వాత అత్యంత దారుణమైన వారపు నష్టాన్ని నమోదు చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చూస్తే బంగారం ఏకంగా 14 శాతం విలువను కోల్పోవడం గమనార్హం.
పసిడి పతనానికి 3 ప్రధాన కారణాలు:
1. బలపడుతున్న డాలర్:
అంతర్జాతీయ అనిశ్చితి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు బంగారం కంటే 'డాలర్' వైపు మొగ్గు చూపుతున్నారు. డాలర్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పుంజుకోవడంతో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనుగోలు ఖరీదైనదిగా మారింది. దీంతో డిమాండ్ తగ్గి ధరలు కుప్పకూలాయి.
2. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు:
యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం భయం పట్టుకుంది. దీన్ని అరికట్టేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనను విరమించుకుంది. వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటం, బాండ్ ఈల్డ్ లు పెరగడంతో.. ఎలాంటి వడ్డీ ఇవ్వని బంగారం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టడానికే ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు.
3. పోర్ట్ఫోలియో రీ-బ్యాలెన్సింగ్:
యుద్ధం వల్ల ఇతర రంగాల్లో (స్టాక్ మార్కెట్ వంటివి) వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు (Profit Booking). దీంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగి ధరలు మరింత దిగజారాయి.
రికార్డు స్థాయి నుండి పతనం:
గత జనవరిలో ట్రాయ్ ఔన్సుకు 5,000 డాలర్ల రికార్డు మార్కును తాకిన పసిడి, ప్రస్తుతం 4,500 డాలర్ల దిగువకు పడిపోయింది. గడిచిన రెండేళ్లలో వచ్చిన లాభాలన్నీ కేవలం కొన్ని వారాల్లోనే ఆవిరి కావడం మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు 'సేఫ్ హెవెన్'గా ఉన్న బంగారం, ఇప్పుడు ఒక 'మీమ్ స్టాక్'లా అస్థిరంగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




