Gold Rate Today: పసిడి ప్రియులకు షాకుల మీద షాకులు.. జేబులకు చిల్లులు పెడుతున్న గోల్డ్ రేట్లు
Gold Rate Today: పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
Gold Rate Today
Gold Rate Today: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్, అమెరికా దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాలు నేరుగా దేశీయ బులియన్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లోని హెచ్చుతగ్గుల వల్ల గత వారం రోజులుగా బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ, నేటి ఉదయం వేళకు పసిడి ధరలు ఒక మోస్తరు స్థాయిలోనే స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు
హైదరాబాద్లో నేటి ఉదయం 07:00 గంటల సమయానికి 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,280 వద్ద వ్యాపారం అవుతోంది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,31,340కి చేరగా, 18 క్యారెట్ల పసిడి ధర రూ.1,07,460 వద్ద కొనసాగుతోంది. తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రధాన నగరాల్లో కూడా హైదరాబాద్ తరహాలోనే ఇవే ధరలు నమోదుకావడం గమనార్హం.
విజయవాడ, విశాఖల్లో కూడా అదే బాట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పసిడి ధరలు హైదరాబాద్తో సమానంగా కొనసాగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,280గా నమోదుకాగా, 22 క్యారెట్ల పసిడి రూ.1,31,340 వద్ద విక్రయమవుతోంది. అలాగే 18 క్యారెట్ల మేలిమి ఆభరణాల పసిడి ధర రూ.1,07,460 వద్ద కొనసాగుతోందని వ్యాపార వర్గాలు వెల్లడించాయి.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు కొన్ని నగరాల్లో పన్నులు, రవాణా ఖర్చుల వ్యత్యాసం వల్ల బంగారం ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,43,430గా ఉండగా, 22 క్యారెట్లు రూ.1,31,440 వద్ద విక్రయమవుతోంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై, కోల్కతా, కేరళ రాష్ట్రాల్లో 24 క్యారెట్లు రూ.1,43,280, 22 క్యారెట్లు రూ.1,31,340గా ఉన్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో 18 క్యారెట్ల పసిడి రూ.1,09,490 వద్ద స్థిరపడగా, అహ్మదాబాద్లో 24 క్యారెట్ల ధర రూ.1,43,330 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి పరుగుకు అడ్డుకట్ట
బంగారం దారినే అనుసరిస్తూ వెండి ధరలు కూడా భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా సగటున కిలో వెండి ధర రూ.2,30,000 మార్కును తాకింది. అయితే తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో స్థానిక పన్నుల ప్రతిబింబంతో కిలో వెండి ధర రూ.2,34,900గా విక్రయమవుతోంది. రానున్న రోజుల్లో పశ్చిమాసియా యుద్ధ తీవ్రతను బట్టి పసిడి, వెండి ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు వచ్చే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.




