Jio Platforms IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీఓ.. $3.8 బిలియన్ల నిధుల సమీకరణకు 'జియో ప్లాట్ఫామ్స్' సిద్ధం!
Jio Platforms IPO: 3.8 బిలియన్ డాలర్ల మెగా ఐపీఓ కోసం ఇన్వెస్టర్లతో జియో ప్లాట్ఫామ్స్ భేటీ కానుంది. సెబీ నుంచి ఇప్పటికే తుది అనుమతి లభించింది.
Jio Platforms IPO: దేశంలోనే అతిపెద్ద ఐపీఓ.. $3.8 బిలియన్ల నిధుల సమీకరణకు 'జియో ప్లాట్ఫామ్స్' సిద్ధం!
Jio Platforms IPO: భారత కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ పబ్లిక్ ఆఫరింగ్గా నిలిచేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ 'జియో ప్లాట్ఫామ్స్' కసరత్తు వేగవంతం చేసింది. సుమారు 3.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 31,500 కోట్లు) నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ వారం చివరలోనే అంతర్జాతీయ ఇన్వెస్టర్ల భేటీలను ప్రారంభించనుంది. మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) నుంచి ఆగస్టు 28నే ఐపీఓ ప్రతిపాదనా పత్రాలకు తుది అనుమతి లభించింది.
ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 27 కోట్ల వరకు కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయాలని యోచిస్తోంది. దీని ఆధారంగా జియో ప్లాట్ఫామ్స్ మొత్తం విలువను రికార్డు స్థాయిలో 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఇష్యూ ద్వారా సేకరించిన నిధులలో సింహభాగాన్ని ప్రధాన అనుబంధ సంస్థ 'రిలయన్స్ జియో ఇన్ఫోకామ్'కు ఉన్న రూ. 27,500 కోట్ల రుణాలను చెల్లించడానికి వినియోగిస్తారు.
అమెరికా, హాంగ్కాంగ్, సింగపూర్, యూకే వంటి దేశాల్లో అంతర్జాతీయ రోడ్షోలు నిర్వహించనున్నారు. 2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి పబ్లిక్ ఆఫరింగ్ ఇది కావడం గమనార్హం. ప్రస్తుతం 50.6 కోట్ల మొబైల్ చందాదారులు, 26.85 కోట్ల 5G వినియోగదారులతో దేశీయ టెలికాం రంగంలో జియో అగ్రస్థానంలో కొనసాగుతోంది.




