Lalithaa Jewellery IPO: లలితా జ్యువెలరీ ఐపీఓకు డేట్ ఫిక్స్.. షేరు ధర ఎంతంటే?
లలితా జ్యువెలరీ రూ.1,700 కోట్ల ఐపీఓ ఆగస్టు 17న ప్రారంభం కానుంది. షేరు ధర రూ.190–201గా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇవే.
Lalithaa Jewellery IPO
లలితా జ్యువెలరీ ఐపీఓ: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ భారీ ఐపీఓకు సిద్ధమైంది. మొత్తం రూ.1,700 కోట్ల విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ఆగస్టు 17న సబ్స్క్రిప్షన్కు తెరుచుకోనుంది. కొత్త స్టోర్ల విస్తరణకు నిధులు సమీకరించడమే ప్రధాన లక్ష్యంగా కంపెనీ ఈ ఐపీఓను తీసుకొస్తోంది.
ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.190 నుంచి రూ.201గా నిర్ణయించారు. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద కంపెనీ విలువ సుమారు రూ.11,250 కోట్లుగా ఉండనుంది.
ఈ ఐపీఓలో రూ.1,200 కోట్ల వరకు ఫ్రెష్ ఇష్యూ, రూ.500 కోట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉండనుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల్లో ప్రధాన భాగాన్ని కొత్త స్టోర్ల ఏర్పాటుకు ఉపయోగించనున్నారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
లలితా జ్యువెలరీ ఐపీఓ ఆగస్టు 17న ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ ఆగస్టు 14న జరగనుంది.
లలితా జ్యువెలరీ మార్ట్ 1985లో చెన్నైలోని టీ.నగర్లో తన తొలి స్టోర్ను ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, వజ్రాభరణాలను విక్రయిస్తోంది. కొత్త స్టోర్ల విస్తరణ ద్వారా వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.




