Chittoor: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బంధువు అరెస్ట్!

Chittoor: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు హరిప్రసాద్‌ను పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.

Chandra Sekhar, Chittoor
Published on: 21 July 2026 11:07 PM IST
Chittoor
X

Chittoor: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బంధువు అరెస్ట్! 

చిత్తూర్: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని కేవలం 24 గంటల్లోనే అరెస్ట్ చేసిన బంగారుపాళ్యం పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS అభినందించారు.ఈ నెల 17న బంగారుపాళ్యం మండలం అండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఆమెకు సమీప బంధువైన గంగవరం మండలం అరసనపల్లి గ్రామానికి చెందిన హరి అలియాస్ హరి ప్రసాద్ మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో, ఆమె తల్లి జూలై 20 రాత్రి బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు క్రైమ్ నెం.112/2026గా BNS సెక్షన్లు 65(1), 75(2), 78(2), 351(2)తో పాటు POCSO చట్టంలోని సెక్షన్ 4 రీడ్ విత్ 3(a) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలమనేరు SDPO డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor

Next Story