Boyakonda: భక్తులతో నిండిన శ్రీ బోయకొండ క్షేత్రం.. కోలాటాల కోలాహలం!

Boyakonda: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆషాడ మాసం మొదటి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది.

MAHESH, PUNGANOOR
Published on: 19 July 2026 8:33 PM IST
Boyakonda
X

Boyakonda: భక్తులతో నిండిన శ్రీ బోయకొండ క్షేత్రం.. కోలాటాల కోలాహలం!

బోయకొండ: ఆషాడ మాసం మొదటి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

బోయకొండ శక్తి క్షేత్రంలో భక్తులు పోటెత్తారు రాష్ట్రం తో పాటు కర్ణాటక తమిళనాడు ల నుంచి ఉదయాన్నే అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనార్థం కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు గంగాపురం నుంచి అమ్మవారి సన్నిధానం వరకు ఎక్కడ చూసినా భక్త జన సందోహం కనిపించింది.

రణభేరి గంగమ్మ ఆలయం నుంచి అమ్మవారి పుష్కరిణి వరకు ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం వాటిలింది క్యూలైన్లు సన్నిధానం పెద్ద భోగం చిన్న భోగం కార్యాలయ సముదాయం వంటి ప్రాంతాలలో ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం పర్యవేక్షించారు.

భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు క్యూ లైన్ లలో పలు చోట్ల ప్రక్షాళన చేయడం వల్ల సాధారణ భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం సులభంగా జరిగింది ఆలయ పరిసర ప్రాంతాలు వాహన రాకపోకలు అంతరాయం వాటిల్లకుండా ఎస్సై చిన్న రెడ్డప్ప బందోబస్తు చర్యలు తీసుకున్నారు.

మదనపల్లి నుంచి పలువురు చిన్నారులు తరలివచ్చి అమ్మవారి ఆలయంలో కోలాటలు వేశారు ఈ కార్యక్రమం యాత్రికులను అలరించింది ఆలయ అధికార అర్చక సిబ్బంది భక్తులకు సేవలు అందించారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story