Kanipakam: బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 2026 వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ సచివాలయంలో ఆవిష్కరించారు.
Kanipakam: బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
Kanipakam: శ్రీ స్వామివారిని దేవస్థానం 2026 వ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను విజయవాడ సచివాలయం నందు ఆవిష్కరించడం జరిగింది,
తరువాత స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం స్వామివారి జ్ఞాపికను వేద ఆశీర్వాదాలు అందజేసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు,
దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు, దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, చైర్మన్ శ్రీ మణి నాయుడు గారు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు శ్రీపతి సతీష్, అర్చకులు వేద పండితులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.




