Madanapalle: అందరికీ 'నేతన్న సేవ' అమలు చేయాలి: జాతీయ చేనేత వేదిక వినతి

Madanapalle: అన్నమయ్య జిల్లా చేనేత కార్మికులందరికీ 'నేతన్న సేవ' వర్తింపజేసి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌కు జాతీయ చేనేత ఐక్య వేదిక వినతి.

Srinivasulu, Madanapalle
Published on: 3 Aug 2026 11:39 AM IST
Madanapalle
X

Madanapalle: అందరికీ 'నేతన్న సేవ' అమలు చేయాలి: జాతీయ చేనేత వేదిక వినతి

చేనేత కార్మికులందరికీ ‘నేతన్న సేవ’ అమలు చేయాలి: జిల్లా కలెక్టర్‌కు జాతీయ చేనేత ఐక్య వేదిక వినతి

మదనపల్లె, ఆగస్టు 3:

అన్నమయ్య జిల్లాలోని చేనేత కార్మికులందరికీ ‘నేతన్న సేవ’ పథకం వర్తింపజేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జాతీయ చేనేత ఐక్య వేదిక జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. సంఘం జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీలం వెంకటేశ్వర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోడెం నాగరాజు ఆధ్వర్యంలో సమర్పించిన వినతిపత్రంలో, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లి, పీలేరు, రాయచోటి, పుంగనూరు ప్రాంతాల్లో సుమారు 20 వేల చేనేత, అనుబంధ వృత్తుల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ‘నేతన్న నేస్తం’ పథకం కింద సుమారు 7 వేల మందికి పైగా లబ్ధిదారులు ప్రయోజనం పొందగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకానికి విడుదల చేసిన జాబితాలో 2,805 మంది పేర్లు తొలగించబడడంతో అనేక మంది చేనేత కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాడుగ ఇళ్లలో సొంత మగ్గాలతో పనిచేసే కార్మికులు, ఒకే ఇంట్లో పలువురు కలిసి మగ్గాలు నిర్వహించే వారు, ఇంటి యజమాని పేరుపై విద్యుత్ మీటర్ ఉండటం వంటి కారణాలతో అర్హత కోల్పోతున్నారని తెలిపారు. ఈ అంశాలపై చేనేత జౌళి శాఖతో సమగ్ర విచారణ నిర్వహించి, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ‘నేతన్న సేవ’ పథకం కింద రూ.25 వేల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story