Madanapalle: పప్పిరెడ్డిపల్లెలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
Madanapalle: పప్పిరెడ్డిపల్లెలో వినాయక చవితి వేడుకలకు హాజరైన ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.
Madanapalle: పప్పిరెడ్డిపల్లెలో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
Madanapalle: బెంగళూరు రోడ్డు నక్కలదిన్నె పప్పిరెడ్డిపల్లెలో ఎన్పీఎస్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదనపల్లె ఏఎంసీ చైర్మన్, జనసేన పార్టీ ఉమ్మడి అన్నమయ్య, చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గ్రానైట్ బాబు, ఏఎంసీ డైరెక్టర్ గెడ్డం లక్ష్మీపతి, వేంపల్లి సువారపు చంద్రశేఖర్, జనసేన PTM హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.




