Chowdepalli: మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు పర్యటన!

Chowdepalli: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డీడీఓ శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు.

MAHESH, PUNGANOOR
Published on: 30 July 2026 10:50 PM IST
Chowdepalli
X

Chowdepalli: మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు పర్యటన!

చౌడేపల్లి: చౌడేపల్లి మండలంలో మదనపల్లె డివిజనల్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన మండల పరిధిలోని పుదిపట్ల స్వచ్ఛ భారత్ సంకల్పం కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న వర్మీ కంపోస్టు తయారీ విధానం, చెత్త సేకరణ తీరును నిశితంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.

​అనంతరం చౌడేపల్లిలోని చెత్త సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న చెత్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించిన ఆయన, తయారైన వర్మీ కంపోస్ట్ ఎరువును స్థానిక రైతులకు అందుబాటులోకి తెచ్చి అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛరథం షెడ్యూల్‌లో భాగంగా అమినిగుంట పంచాయతీలో పర్యటించి పొడి చెత్త సేకరణ విధానాన్ని, గ్రామంలోని పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు స్వచ్ఛరథం ఆపరేటర్‌తో నేరుగా మాట్లాడారు. స్వచ్ఛరథం సేవలను మరింత సమర్థవంతంగా మరియు మెరుగ్గా ప్రజలకు అందించడానికి చేపట్టాల్సిన పలు ముందస్తు చర్యలను, సూచనలను వివరించారు. ​ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి లీలా మాధురి, డిప్యూటీ ఎంపీడీవోలు మస్తాన్, గఫూర్, పంచాయతీ అభివృద్ధి అధికారులు రెడ్డి ప్రకాష్ రెడ్డి, శివ, మహేశ్వర్, అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story