Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!

Madanapalle: మదనపల్లె మండలం వందాడి వారిపల్లెలో భూ రీ-సర్వే ఘర్షణ.

Srinivasulu, Madanapalle
Published on: 22 July 2026 4:00 PM IST
Madanapalle
X

Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!

Madanapalle: భూ రీ-సర్వే సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రైతు కుటుంబంపై దాడి జరిగిన ఘటన మదనపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మదనపల్లె మండలం పోతబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని వందాడి వారిపల్లెకు చెందిన రైతు లక్ష్మన్నకు చెందిన భూమిపై వివాదం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో లక్ష్మన్న, కృష్ణయ్య లు ఇటీవల కోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందినట్లు తెలిపారు.

బుధవారం రెవెన్యూ అధికారులు భూమి రీ-సర్వేకు వచ్చిన సమయంలో లక్ష్మన్న, కృష్ణయ్య కోర్టు స్టే ఉత్తర్వులను అధికారులకు చూపించి, వాటి ప్రకారం సర్వే నిర్వహించాలని కోరారు. ఈ క్రమంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ఎన్. శ్రీనివాసులు, రాధా వర్గీయులు లక్ష్మన్న కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో లక్ష్మన్న, .కె.కృష్ణప్ప, కె. శ్రీనివాసులు, ఈశ్వరమ్మ లు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story