Ramasamudram: వలస కార్మికుల వివరాల నమోదు తప్పనిసరి.. ఎస్పీ ఆదేశాలు
Ramasamudram: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రామసముద్రం పరిధిలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఎస్ఐ హృషీకేశవ రెడ్డి ఆదేశించారు.
Ramasamudram: వలస కార్మికుల వివరాల నమోదు తప్పనిసరి.. ఎస్పీ ఆదేశాలు
Ramasamudram: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని బుధవారం రామసముద్రం పోలీసులు తెలిపారు. భవన నిర్మాణాలు, హోటళ్లు, ఇటుక బట్టీలు, గోదాములు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను రెండు, మూడు రోజుల్లోగా సమర్పించాలని సూచించారు. నమోదు చేయకపోతే యజమానులు, కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హృషీకేశవ రెడ్డి హెచ్చరించారు.
Next Story




