Madanapalle: మదనపల్లెలో ఘనంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం!

Madanapalle: మదనపల్లెలో ఘనంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. ఈశ్వరమ్మ కాలనీలో తక్కువ ధరల రైస్ మిల్లుల అవుట్‌లెట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా.

Srinivasulu, Madanapalle
Published on: 2 Aug 2026 10:56 AM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో ఘనంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం!

Madanapalle: మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీలో ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు బజార్లు, రైస్ మిల్లుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తక్కువ ధరల స్టోర్ (అవుట్‌లెట్) ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు.నాణ్యమైన బియ్యం, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటు ధరల్లో లభించేలా ఈ అవుట్‌లెట్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ మధుబాబు, శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం చైర్మన్ గంగారపు నవీన్ కుమార్ చౌదరి, ఈశ్వరమ్మ కాలనీ క్లస్టర్ ఇంచార్జ్ మాకినేని చంద్రశేఖర్ నాయుడు, జె.వి. రమణ, రైస్ మిల్ శశి, రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు తలారి రాధ, మదనపల్లె పట్టణ మహిళా అధ్యక్షురాలు రాటకొండ భారతి, పూల మురళి, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story