Annamayya: ఎల్లమ్మ జాతరపై ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పెషల్ ఫోకస్..

Annamayya: జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కలికిరి శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర ముందస్తు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 30 July 2026 4:10 PM IST
Annamayya
X

Annamayya: ఎల్లమ్మ జాతరపై ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ స్పెషల్ ఫోకస్..

అన్నమయ్య: అన్నమయ్య జిల్లా కలికిరి లొ అత్యంత వైభవంగా జరిగే ఎల్లమ్మ జాతర లొ భక్తులకు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా క్యూలైన్ల నిర్వహణ చేపట్టాలని జిల్లా ఎస్ పి దీరజ్ కునుబిల్లి ఆలయ నిర్వాహుకులకు ఆదేశించారు.

రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు, స్పష్టమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.అసాంఘిక శక్తులపై డేగకన్ను వేసి, పండుగ వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ శ్రీ ఎం.ఆర్. కృష్ణమోహన్, కలికిరి సీఐ శ్రీ అనిల్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సదాశివయ్య పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story