Madanapalle: చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి వాహనాల తనిఖీ

Madanapalle: మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Srinivasulu, Madanapalle
Published on: 27 July 2026 12:19 PM IST
Madanapalle: చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి వాహనాల తనిఖీ
X

మదనపల్లె, జూలై 27: అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని చిప్పిలి వద్ద ట్రాఫిక్ ఎస్ఐ గాయత్రి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ఆదివారం ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ద్విచక్ర, త్రిచక్ర మరియు ఇతర వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, బీమా పత్రాలు, కాలుష్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు.

అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగంగా వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ గాయత్రి మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు.

ప్రజల భద్రతే లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు పోలీసు సిబ్బందితో కలిసి నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story